ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో!
- వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల కలకలం
- ట్రంప్, మెలనియాను సురక్షిత ప్రాంతానికి తరలించిన సీక్రెట్ సర్వీస్
- ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
- కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించానన్న డొనాల్డ్ ట్రంప్
- భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ట్రంప్
అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హాజరైన సమయంలో పెద్ద శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ట్రంప్ దంపతులను వెంటనే తమ భద్రతా వలయంలోకి తీసుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనతో వేదిక వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 'కిందకు వంగండి, కిందకు వంగండి' అంటూ అరుపులు వినిపించాయి. వందలాది మంది జర్నలిస్టులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు టేబుళ్ల కింద దాక్కున్నారు. కొద్ది క్షణాల్లోనే కంబాట్ గేర్తో సీక్రెట్ సర్వీస్ అధికారులు డైనింగ్ హాల్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్, డగ్ బర్గమ్, మార్కో రూబియో వంటి పలువురు సీనియర్ అధికారులను కూడా సిబ్బంది నేలపైకి నెట్టారు. అనంతరం క్యాబినెట్ సభ్యులను ఒక్కొక్కరిగా బయటకు పంపించారు.
ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ స్పందిస్తూ... ట్రంప్, మెలనియా సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించింది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. అనుమానితుడు ప్రాణాలతోనే ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ట్రూత్ సోషల్'లో స్పందించారు. "సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా బలగాలు చాలా వేగంగా, ధైర్యంగా స్పందించాయి" అని ప్రశంసించారు. షూటర్ను అదుపులోకి తీసుకున్నారని నిర్ధారిస్తూ.. 'లెట్ ది షో గో ఆన్' (కార్యక్రమాన్ని కొనసాగించండి) అని తాను సూచించినట్లు తెలిపారు. అయితే, భద్రతా అధికారుల నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ గందరగోళం కారణంగా కార్యక్రమాన్ని మరో తేదీలో నిర్వహించాల్సి రావొచ్చని పేర్కొన్నారు.
కాగా, 2024 జులైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్ప గాయమైంది.
ఈ ఘటనతో వేదిక వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 'కిందకు వంగండి, కిందకు వంగండి' అంటూ అరుపులు వినిపించాయి. వందలాది మంది జర్నలిస్టులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు టేబుళ్ల కింద దాక్కున్నారు. కొద్ది క్షణాల్లోనే కంబాట్ గేర్తో సీక్రెట్ సర్వీస్ అధికారులు డైనింగ్ హాల్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్, డగ్ బర్గమ్, మార్కో రూబియో వంటి పలువురు సీనియర్ అధికారులను కూడా సిబ్బంది నేలపైకి నెట్టారు. అనంతరం క్యాబినెట్ సభ్యులను ఒక్కొక్కరిగా బయటకు పంపించారు.
ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ స్పందిస్తూ... ట్రంప్, మెలనియా సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించింది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. అనుమానితుడు ప్రాణాలతోనే ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ట్రూత్ సోషల్'లో స్పందించారు. "సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా బలగాలు చాలా వేగంగా, ధైర్యంగా స్పందించాయి" అని ప్రశంసించారు. షూటర్ను అదుపులోకి తీసుకున్నారని నిర్ధారిస్తూ.. 'లెట్ ది షో గో ఆన్' (కార్యక్రమాన్ని కొనసాగించండి) అని తాను సూచించినట్లు తెలిపారు. అయితే, భద్రతా అధికారుల నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ గందరగోళం కారణంగా కార్యక్రమాన్ని మరో తేదీలో నిర్వహించాల్సి రావొచ్చని పేర్కొన్నారు.
కాగా, 2024 జులైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్ప గాయమైంది.