ఏపీలో ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం
- విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన
- మృతులు టెక్ మహీంద్రా ఉద్యోగులు కుశాల్ కుమార్, షేక్ తౌసీఫ్గా గుర్తింపు
- అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
- భీమిలి వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వైనం
విశాఖ నగరంలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (32), షేక్ తౌసీఫ్ (27) స్నేహితులు. కుశాల్ కుమార్ టీమ్ మేనేజర్గా, తౌసీఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్లో బస చేసి, శనివారం ఉదయం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై భీమిలి వైపు బయలుదేరారు.
ఐఎన్ఎస్ కళింగ గేటు దాటి ఎర్రమట్టి దిబ్బల సమీపంలోకి రాగానే, అతివేగం కారణంగా కుశాల్ కుమార్ బైక్పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్ అదుపుతప్పి ముందుగా రోడ్డు డివైడర్ను, ఆ తర్వాత పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న భీమిలి సీఐ తిరుమలరావు, ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి గంగిరి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుశాల్ తండ్రి విశాఖ పోర్ట్ ట్రస్ట్లో రిటైర్డ్ ఉద్యోగి కాగా, మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన తౌసీఫ్ నగరంలోని గురుద్వారా ప్రాంతంలో అద్దె గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికీ ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (32), షేక్ తౌసీఫ్ (27) స్నేహితులు. కుశాల్ కుమార్ టీమ్ మేనేజర్గా, తౌసీఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్లో బస చేసి, శనివారం ఉదయం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై భీమిలి వైపు బయలుదేరారు.
ఐఎన్ఎస్ కళింగ గేటు దాటి ఎర్రమట్టి దిబ్బల సమీపంలోకి రాగానే, అతివేగం కారణంగా కుశాల్ కుమార్ బైక్పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్ అదుపుతప్పి ముందుగా రోడ్డు డివైడర్ను, ఆ తర్వాత పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న భీమిలి సీఐ తిరుమలరావు, ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి గంగిరి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుశాల్ తండ్రి విశాఖ పోర్ట్ ట్రస్ట్లో రిటైర్డ్ ఉద్యోగి కాగా, మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన తౌసీఫ్ నగరంలోని గురుద్వారా ప్రాంతంలో అద్దె గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికీ ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.