హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

  • కంటైనర్‌పై కాల్పులు జరిపిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడి
  • కాల్పులకు ముందు గన్ బోట్ నౌకకు హెచ్చరికలు చేయలేదని వెల్లడి
  • దాడిని ధ్రువీకరించిన ఇరాన్ మీడియా
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు కార్యరూపం దాల్చలేదు. ఇదే సమయంలో, ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరిపి పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. టెహ్రాన్ నుండి ఏకీకృత ప్రతిపాదన కోసం ఎదురుచూస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) హర్మూజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులకు పాల్పడిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. కాల్పులకు ముందు గన్‌బోట్ నౌకకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలిపింది. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది.

ఇరాన్ మీడియా కూడా ఈ దాడిని ధ్రువీకరించింది. అయితే కాల్పులకు గల కారణాలు వెల్లడించలేదు. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి జరగడం ఉద్రిక్తతలను మరోసారి పెంచింది.

అమెరికాతో చర్చలపై ఇరాన్ స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ మాట్లాడుతూ, అమెరికాతో రెండో విడత చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో తమ నౌకలపై కొనసాగుతోన్న దిగ్బంధాన్ని ఎత్తివేయాలని షరతు విధించారు. తమ నౌకలను దిగ్బంధించడంతో పాటు, అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. తమ షరతులకు అమెరికా కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందాయని తెలిపారు. అమెరికా దిగ్బంధనాన్ని తొలగిస్తే వెంటనే చర్చలు ప్రారంభమవుతాయని అన్నారు.

Iran Attacks Container Ship
Strait of Hormuz
Ceasefire Extension

More Telugu News