పెద్దపల్లి జిల్లాలో దారుణం... చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

  • సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దుర్ఘటన
  • ఇంటి ముందు ఆడుకుంటుండగా మూడేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి
  • పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్న కుక్కలు
తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దివ్యా బెహ్రా అనే బాలిక తమ ఇంటి ముందు వీధిలో ఆడుకుంటోంది. ఈ సమయంలో బాలికపై కుక్కలు దాడి చేశాయి.

కుక్కలు బాలికను నోట కరుచుకుని పొలాల్లోకి తీసుకువెళ్లాయి. ఈ క్రమంలో కుక్కలు పీక్కుతినడంతో తీవ్రగాయాలతో చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టీల్లో పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయ విదారకమైన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంంది. 

Dog attack 3 Year Old girl in Telangana
Dog bite

More Telugu News