ఇరాన్తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తక్షణమే దిగ్బంధించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించినట్లు ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్ ను చాలా వరకు నాశనం చేశామని... ఆ దేశానికి చెందిన నేవీ, సైన్యం, ఇతర బలగాలు దెబ్బతిన్నాయని, ఇక మిగిలి ఉన్న కొంచెం భాగాన్ని కూడా తమ సైన్యం ముగించేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. చర్చల వివరాలను వారు తనకు పూర్తిగా వివరించారని ట్రంప్ తెలిపారు.
"చర్చలు బాగానే జరిగాయి, చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కానీ నిజంగా ముఖ్యమైన ఏకైక అంశం, అణు కార్యక్రమంపై మాత్రం ఒప్పందం కుదరలేదు. ఇరాన్ తన అణు ఆకాంక్షలను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు! ఆ అంశం చర్చకు వచ్చేసరికి ఇరాన్ మొండికేసింది" అని ట్రంప్ తన పోస్టులో విమర్శించారు.
ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదని, అస్థిరమైన వ్యక్తుల చేతిలో అణ్వాయుధాలు ఉండటాన్ని అనుమతించలేమని స్పష్టం చేశారు. 'ఇరాన్కు అణ్వస్త్రం ఎప్పటికీ దక్కదు' అని ఆయన తేల్చిచెప్పారు.
చర్చల వైఫల్యం నేపథ్యంలోనే ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. "హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా, అన్ని నౌకలను దిగ్బంధించడం ప్రారంభించాలని నేను మా నౌకాదళాన్ని ఆదేశించాను. త్వరలోనే దిగ్బంధనం ప్రారంభమవుతుంది," అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను ధ్వంసం చేయాలని, ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించిన ప్రతి ఓడను అంతర్జాతీయ జలాల్లో అడ్డగించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. "మాపై గానీ, శాంతియుతంగా వెళుతున్న నౌకలపై గానీ కాల్పులు జరిపిన ఏ ఇరానియన్ను అయినా నరకానికి పంపుతాం!" అని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని గతంలో వాగ్దానం చేసి, ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.
ప్రపంచంలోని ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్యంపై మరోసారి తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. చర్చల వివరాలను వారు తనకు పూర్తిగా వివరించారని ట్రంప్ తెలిపారు.
"చర్చలు బాగానే జరిగాయి, చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కానీ నిజంగా ముఖ్యమైన ఏకైక అంశం, అణు కార్యక్రమంపై మాత్రం ఒప్పందం కుదరలేదు. ఇరాన్ తన అణు ఆకాంక్షలను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు! ఆ అంశం చర్చకు వచ్చేసరికి ఇరాన్ మొండికేసింది" అని ట్రంప్ తన పోస్టులో విమర్శించారు.
ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదని, అస్థిరమైన వ్యక్తుల చేతిలో అణ్వాయుధాలు ఉండటాన్ని అనుమతించలేమని స్పష్టం చేశారు. 'ఇరాన్కు అణ్వస్త్రం ఎప్పటికీ దక్కదు' అని ఆయన తేల్చిచెప్పారు.
చర్చల వైఫల్యం నేపథ్యంలోనే ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. "హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా, అన్ని నౌకలను దిగ్బంధించడం ప్రారంభించాలని నేను మా నౌకాదళాన్ని ఆదేశించాను. త్వరలోనే దిగ్బంధనం ప్రారంభమవుతుంది," అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను ధ్వంసం చేయాలని, ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించిన ప్రతి ఓడను అంతర్జాతీయ జలాల్లో అడ్డగించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. "మాపై గానీ, శాంతియుతంగా వెళుతున్న నౌకలపై గానీ కాల్పులు జరిపిన ఏ ఇరానియన్ను అయినా నరకానికి పంపుతాం!" అని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని గతంలో వాగ్దానం చేసి, ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.
ప్రపంచంలోని ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్యంపై మరోసారి తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.