ఐపీఎల్ మ్యాచ్ లక్నో vs గుజరాత్: టాస్ గెలిచిన శుభ్మన్ గిల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది.
టాస్ గెలిచిన అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. "మేం మొదట ఫీల్డింగ్ చేస్తాం. గత మ్యాచ్లో సాధించిన రెండు పాయింట్లు మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఈసారి మరింత మెరుగైన క్రికెట్ ఆడి, మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లకుండా చూస్తాం. ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలో స్థిరత్వం చాలా ముఖ్యం" అని తెలిపాడు. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశాడు.
లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. "ప్రతి విజయం మాకు చాలా కీలకం. ముఖ్యంగా గత మ్యాచ్లో గెలిచిన తీరు జట్టు స్ఫూర్తిని తెలియజేసింది. అయితే, మేము ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. గత మ్యాచ్ గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చినా, ప్రతి మ్యాచ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి" అని అన్నాడు. తాము కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతున్నామని పంత్ పేర్కొన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.
టాస్ గెలిచిన అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. "మేం మొదట ఫీల్డింగ్ చేస్తాం. గత మ్యాచ్లో సాధించిన రెండు పాయింట్లు మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఈసారి మరింత మెరుగైన క్రికెట్ ఆడి, మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లకుండా చూస్తాం. ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలో స్థిరత్వం చాలా ముఖ్యం" అని తెలిపాడు. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశాడు.
లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. "ప్రతి విజయం మాకు చాలా కీలకం. ముఖ్యంగా గత మ్యాచ్లో గెలిచిన తీరు జట్టు స్ఫూర్తిని తెలియజేసింది. అయితే, మేము ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. గత మ్యాచ్ గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చినా, ప్రతి మ్యాచ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి" అని అన్నాడు. తాము కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతున్నామని పంత్ పేర్కొన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.