Chandrababu Naidu: అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన

ఆంధ్రప్రదేశ్ ప్రజల కల అయిన ప్రజా రాజధాని అమరావతి ఇక భద్రంగా ఉందని, ఇది యావత్ రాష్ట్ర ప్రజల విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించిన నేపథ్యంలో గవర్నర్ ట్వీట్ చేయగా, చంద్రబాబు స్పందించారు.

ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "చారిత్రక అమరావతి తీర్మానంతో మన ప్రజా రాజధాని కల నెరవేరింది. ఇది మనందరి విజయం" అని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపును కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు.

చట్టసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టపరమైన బలం చేకూరినట్లయింది. ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, అమరావతి ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
AP Capital
Abdul Nazeer
AP Governor
Amaravati Bill
AP Assembly
Andhra Pradesh Politics
Capital City

More Telugu News