Chandrababu Naidu: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు, తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా సాగింది.
ఈ దివ్య కల్యాణ మహోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలివచ్చారు. రామనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పండితులు సంప్రదాయబద్ధంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించి, భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే ఈ కల్యాణ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కల్యాణ వేడుక భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.
ఈ వేడుకలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు మనవడు నారా దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు.
ఈ దివ్య కల్యాణ మహోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలివచ్చారు. రామనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పండితులు సంప్రదాయబద్ధంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించి, భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే ఈ కల్యాణ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కల్యాణ వేడుక భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.
ఈ వేడుకలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు మనవడు నారా దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు.