Poonam Pandey: బేబీ బంప్తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు
వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్ను పైకి మడిచి బేబీ బంప్ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. దీనికి క్యాప్షన్గా గర్భవతి, పాలసీసా ఎమోజీలను జోడించారు.
క్యాన్సర్ డ్రామా తర్వాత.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ.. పూనమ్పై నెటిజన్ల అనుమానం
అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఆమె పబ్లిసిటీ స్టంట్లలో భాగమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె చేసిన ఫేక్ ప్రచారమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. 2024 ఫిబ్రవరిలో గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని, క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకే ఈ డ్రామా ఆడానని చెప్పడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజా ప్రెగ్నెన్సీ ప్రకటన కూడా ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కొందరు నెటిజన్లు అయితే ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించినవి కావొచ్చని కామెంట్లు చేస్తున్నారు. 2011 క్రికెట్ ప్రపంచకప్ భారత్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని చెప్పి పూనమ్ పాండే వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు పెట్టడం, విడాకులు తీసుకోవడం వంటి పరిణామాలతో వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన 'లాక్ అప్' షోలో ఆమె చివరిసారిగా కనిపించారు.
క్యాన్సర్ డ్రామా తర్వాత.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ.. పూనమ్పై నెటిజన్ల అనుమానం
అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఆమె పబ్లిసిటీ స్టంట్లలో భాగమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె చేసిన ఫేక్ ప్రచారమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. 2024 ఫిబ్రవరిలో గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని, క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకే ఈ డ్రామా ఆడానని చెప్పడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజా ప్రెగ్నెన్సీ ప్రకటన కూడా ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కొందరు నెటిజన్లు అయితే ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించినవి కావొచ్చని కామెంట్లు చేస్తున్నారు. 2011 క్రికెట్ ప్రపంచకప్ భారత్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని చెప్పి పూనమ్ పాండే వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు పెట్టడం, విడాకులు తీసుకోవడం వంటి పరిణామాలతో వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన 'లాక్ అప్' షోలో ఆమె చివరిసారిగా కనిపించారు.