Masood Azhar: మసూద్ అజర్కు మరో షాక్.. పాకిస్థాన్లో సోదరుడి అనుమానాస్పద మృతి!
భారత్లో అనేక భయానక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడి సోదరుడు, సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్న మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించాడు. అయితే అతడి మృతికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో ఇది సహజ మరణం కాకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాహిర్ అన్వర్ మరణించిన విషయాన్ని జైషే మహమ్మద్ సంస్థ తన అధికారిక ఛానల్ ద్వారా ధ్రువీకరించింది. సోమవారం రాత్రి బహావల్పూర్లోని జామియా మసీదు ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు నిర్వహించినట్టు ప్రకటించింది. అయితే, మరణానికి అనారోగ్యం లేదా మరేదైనా కారణాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. ఇది అతడి మరణంపై నెలకొన్న ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. తాహిర్ అన్వర్ చాలాకాలంగా సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడు.
గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' చేపట్టాయని, అందులో భాగంగానే మసూద్ అజర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే అజర్ సోదరి, బావ, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు తాహిర్ అన్వర్ మరణించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2001 పార్లమెంటు దాడి, పఠాన్కోట్, ఉరి, పుల్వామా దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ దాడులకు ప్రతిగా భారత బలగాలు పాక్లోని బహావల్పూర్లోని జైషే స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో తమ కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయని, పలువురు మరణించారని గత సెప్టెంబరులో ఆ సంస్థ కమాండర్ ఒకరు పరోక్షంగా అంగీకరించారు.
తాహిర్ అన్వర్ మరణించిన విషయాన్ని జైషే మహమ్మద్ సంస్థ తన అధికారిక ఛానల్ ద్వారా ధ్రువీకరించింది. సోమవారం రాత్రి బహావల్పూర్లోని జామియా మసీదు ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు నిర్వహించినట్టు ప్రకటించింది. అయితే, మరణానికి అనారోగ్యం లేదా మరేదైనా కారణాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. ఇది అతడి మరణంపై నెలకొన్న ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. తాహిర్ అన్వర్ చాలాకాలంగా సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడు.
గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' చేపట్టాయని, అందులో భాగంగానే మసూద్ అజర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే అజర్ సోదరి, బావ, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు తాహిర్ అన్వర్ మరణించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2001 పార్లమెంటు దాడి, పఠాన్కోట్, ఉరి, పుల్వామా దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ దాడులకు ప్రతిగా భారత బలగాలు పాక్లోని బహావల్పూర్లోని జైషే స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో తమ కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయని, పలువురు మరణించారని గత సెప్టెంబరులో ఆ సంస్థ కమాండర్ ఒకరు పరోక్షంగా అంగీకరించారు.