Ajinkya Rahane: వాంఖెడేలో కేకేఆర్ పరుగుల వెల్లువ... ముంబై ముందు భారీ టార్గెట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ అజింక్యా రహానె (40 బంతుల్లో 67), యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (28 బంతుల్లో 51) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3/39) ఒక్కడే రాణించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్లు అజింక్యా రహానె, ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పవర్ప్లేలో ఈ జోడీ విధ్వంసం సృష్టించింది. తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత గేరు మార్చారు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో రహానె రెండు సిక్సర్లు, అలెన్ రెండు ఫోర్లు బాదడంతో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో కేకేఆర్ కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ గజన్ఫర్ వేసిన ఓవర్లోనూ అలెన్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో 17 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో తొలి వికెట్కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన ఫిన్ అలెన్ను ఔట్ చేసి ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు కామెరాన్ గ్రీన్ (18)ను కూడా శార్దూల్ పెవిలియన్కు పంపాడు. మరోవైపు, 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానెను కూడా శార్దూలే దెబ్బకొట్టాడు. క్రాస్ సీమ్ బంతికి రహానె ఇచ్చిన క్యాచ్ను పాండ్యా అందుకోవడంతో కేకేఆర్ కాస్త నెమ్మదించింది.
వరుస వికెట్లతో కష్టాల్లో పడినట్లు కనిపించిన కేకేఆర్ను యువ కెరటం అంగ్క్రిష్ రఘువంశీ, ఫినిషర్ రింకూ సింగ్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా రఘువంశీ అద్భుతంగా ఆడి కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివరిలో రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ స్కోరు 200 దాటి 220 పరుగులకు చేరింది. ముంబై ఇండియన్స్కు 221 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
సంక్షిప్త స్కోర్లు: కోల్కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో 220/4 (అజింక్యా రహానె 67, అంగ్క్రిష్ రఘువంశీ 51, ఫిన్ అలెన్ 37, రింకూ సింగ్ 33*; శార్దూల్ ఠాకూర్ 3/39).
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్లు అజింక్యా రహానె, ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పవర్ప్లేలో ఈ జోడీ విధ్వంసం సృష్టించింది. తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత గేరు మార్చారు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో రహానె రెండు సిక్సర్లు, అలెన్ రెండు ఫోర్లు బాదడంతో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో కేకేఆర్ కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ గజన్ఫర్ వేసిన ఓవర్లోనూ అలెన్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో 17 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో తొలి వికెట్కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన ఫిన్ అలెన్ను ఔట్ చేసి ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు కామెరాన్ గ్రీన్ (18)ను కూడా శార్దూల్ పెవిలియన్కు పంపాడు. మరోవైపు, 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానెను కూడా శార్దూలే దెబ్బకొట్టాడు. క్రాస్ సీమ్ బంతికి రహానె ఇచ్చిన క్యాచ్ను పాండ్యా అందుకోవడంతో కేకేఆర్ కాస్త నెమ్మదించింది.
వరుస వికెట్లతో కష్టాల్లో పడినట్లు కనిపించిన కేకేఆర్ను యువ కెరటం అంగ్క్రిష్ రఘువంశీ, ఫినిషర్ రింకూ సింగ్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా రఘువంశీ అద్భుతంగా ఆడి కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివరిలో రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ స్కోరు 200 దాటి 220 పరుగులకు చేరింది. ముంబై ఇండియన్స్కు 221 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
సంక్షిప్త స్కోర్లు: కోల్కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో 220/4 (అజింక్యా రహానె 67, అంగ్క్రిష్ రఘువంశీ 51, ఫిన్ అలెన్ 37, రింకూ సింగ్ 33*; శార్దూల్ ఠాకూర్ 3/39).