Jairam Ramesh: పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'... ఇది కేంద్ర వైఫల్యమే: జైరాం రమేశ్
ఒకప్పుడు ఏకాకిగా ఉన్న పాకిస్థాన్కు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా నుంచి కొత్తగా గౌరవం, మధ్యవర్తి హోదా లభించడంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ... గతంలో క్లింటన్, బుష్, ఒబామా, బైడెన్ వంటి అమెరికా అధ్యక్షులు పాకిస్థాన్తో కఠినంగా వ్యవహరించారని గుర్తుచేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాక్కు ఇప్పుడు ట్రంప్ హయాంలో కొత్త ఆదరణ లభించిందన్నారు. "భారత్ సైనికపరంగా 'ఆపరేషన్ సిందూర్'లో విజయం సాధించినా, దాన్ని దౌత్యపరంగా సద్వినియోగం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్ మాటల్లో చెప్పాలంటే పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'గా మారింది. ఇది మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం" అని జైరాం రమేశ్ విమర్శించారు.
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని, కానీ కాంగ్రెస్ నిరంతరం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పాకిస్థాన్ను 'దళారీ' అని పిలిచినందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆయన అభినందించారు.
ఇటీవల మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "భారత్ ఎప్పటికీ 'దళారీ' దేశంగా ఉండబోదు" అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే 'దళారీ' పదం చుట్టూ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ... గతంలో క్లింటన్, బుష్, ఒబామా, బైడెన్ వంటి అమెరికా అధ్యక్షులు పాకిస్థాన్తో కఠినంగా వ్యవహరించారని గుర్తుచేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాక్కు ఇప్పుడు ట్రంప్ హయాంలో కొత్త ఆదరణ లభించిందన్నారు. "భారత్ సైనికపరంగా 'ఆపరేషన్ సిందూర్'లో విజయం సాధించినా, దాన్ని దౌత్యపరంగా సద్వినియోగం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్ మాటల్లో చెప్పాలంటే పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'గా మారింది. ఇది మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం" అని జైరాం రమేశ్ విమర్శించారు.
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని, కానీ కాంగ్రెస్ నిరంతరం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పాకిస్థాన్ను 'దళారీ' అని పిలిచినందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆయన అభినందించారు.
ఇటీవల మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "భారత్ ఎప్పటికీ 'దళారీ' దేశంగా ఉండబోదు" అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే 'దళారీ' పదం చుట్టూ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.