Narendra Modi: సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ, ఆయా దేశాధినేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ ప్రధానితో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను మోదీ ఖండించారు.
నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగడం, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా తెరిచి ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని భారతీయులకు నిరంతరం తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.
"సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడి, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై చర్చించాను. ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను భారత్ ఖండిస్తుందని పునరుద్ఘాటించాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా దేశాధినేతలతో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.
నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగడం, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా తెరిచి ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని భారతీయులకు నిరంతరం తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.
"సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడి, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై చర్చించాను. ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను భారత్ ఖండిస్తుందని పునరుద్ఘాటించాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా దేశాధినేతలతో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.