Suicide: లోన్ యాప్ వేధింపులు.. కాకినాడలో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య

Mohammed Basheer MBA Student Suicide Due to Loan App Harassment in Kakinada
షార్ట్స్‌లో చూడండి
లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు ఓ లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే, ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.

ఈ ఒత్తిడిని తట్టుకోలేక, తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
Go Back to Shorts
Suicide
Mohammed Basheer
Loan App Harassment
Kakinada
MBA Student Suicide
Andhra Pradesh
Loan Apps
Student
Gundepalli
Private College

More Telugu News