భర్తతో విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడంపై సైనా నెహ్వాల్ ఏమన్నదంటే...!
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, తన భర్త, సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్తో విడాకులు తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కలిసిన ఈ జంట ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తోంది. తమ బంధంలో ఎదురైన సవాళ్లు, తిరిగి ఒక్కటవ్వడానికి గల కారణాలను సైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బంధమంటే వాదనలు గెలవడం కాదని, భాగస్వామ్యంతో కలిసి ప్రయాణించడమని తాము గ్రహించినట్లు ఆమె వెల్లడించింది.
ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సైనా ఈ విషయాలను వెల్లడించింది. "ప్రతి బంధంలో కొన్ని దశలు ఉంటాయి. ఇద్దరు బలమైన వ్యక్తిత్వాలు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ పరస్పర గౌరవం, అవగాహన, సమస్యలను పరిష్కరించుకోవాలనే సంకల్పం చాలా ముఖ్యం" అని సైనా పేర్కొంది. కొంతకాలం విడిగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్, ఓపిక ఎంత ముఖ్యమో అర్థమైందని ఆమె తెలిపారు. ఒకరి దృక్కోణాన్ని మరొకరు అర్థం చేసుకునేందుకు వెనక్కి తగ్గడం అవసరమని గ్రహించామన్నారు. బంధమంటే పైచేయి సాధించడం కాదని, అది ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎదగడమని తెలుసుకున్నామని చెప్పారు.
నమ్మకం, గౌరవం, కమ్యూనికేషన్ అనేవి ఏ బంధానికైనా పునాది అని సైనా అభిప్రాయపడ్డారు. చాలా సమస్యలు నిజాయతీగా మాట్లాడుకోవడం ఆపేసినప్పుడే మొదలవుతాయన్నారు. "ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవడం, వ్యక్తిగత లక్ష్యాలకు మద్దతుగా నిలవడం చాలా అవసరం. నేటి వేగవంతమైన జీవితంలో అహం, అపార్థాలు సులభంగా దూరాన్ని పెంచుతాయి. వెంటనే స్పందించడం కాకుండా, అర్థం చేసుకోవడంపై దృష్టి పెడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి" అని ఆమె వివరించారు. 2018లో వివాహం చేసుకున్న సైనా, కశ్యప్.. 2025 జూలై 13న విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్దికాలానికే వారు తిరిగి కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో తల్లి కావడంపై కూడా సైనా మాట్లాడారు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, సమాజం విధించే కాలపరిమితులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహిళలు తమ కెరీర్, ఆశయాలు, వ్యక్తిగత ఎంపికలను సమర్థంగా నిర్వహిస్తున్నారని, వారి నిర్ణయాలను గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం తామిద్దరం ఒకరి లక్ష్యాలకు మరొకరం మద్దతు ఇచ్చుకుంటూ, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని సైనా తెలిపారు. ఈ జంట మళ్లీ కలవడంపై వారి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సైనా ఈ విషయాలను వెల్లడించింది. "ప్రతి బంధంలో కొన్ని దశలు ఉంటాయి. ఇద్దరు బలమైన వ్యక్తిత్వాలు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ పరస్పర గౌరవం, అవగాహన, సమస్యలను పరిష్కరించుకోవాలనే సంకల్పం చాలా ముఖ్యం" అని సైనా పేర్కొంది. కొంతకాలం విడిగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్, ఓపిక ఎంత ముఖ్యమో అర్థమైందని ఆమె తెలిపారు. ఒకరి దృక్కోణాన్ని మరొకరు అర్థం చేసుకునేందుకు వెనక్కి తగ్గడం అవసరమని గ్రహించామన్నారు. బంధమంటే పైచేయి సాధించడం కాదని, అది ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎదగడమని తెలుసుకున్నామని చెప్పారు.
నమ్మకం, గౌరవం, కమ్యూనికేషన్ అనేవి ఏ బంధానికైనా పునాది అని సైనా అభిప్రాయపడ్డారు. చాలా సమస్యలు నిజాయతీగా మాట్లాడుకోవడం ఆపేసినప్పుడే మొదలవుతాయన్నారు. "ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవడం, వ్యక్తిగత లక్ష్యాలకు మద్దతుగా నిలవడం చాలా అవసరం. నేటి వేగవంతమైన జీవితంలో అహం, అపార్థాలు సులభంగా దూరాన్ని పెంచుతాయి. వెంటనే స్పందించడం కాకుండా, అర్థం చేసుకోవడంపై దృష్టి పెడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి" అని ఆమె వివరించారు. 2018లో వివాహం చేసుకున్న సైనా, కశ్యప్.. 2025 జూలై 13న విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్దికాలానికే వారు తిరిగి కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో తల్లి కావడంపై కూడా సైనా మాట్లాడారు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, సమాజం విధించే కాలపరిమితులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహిళలు తమ కెరీర్, ఆశయాలు, వ్యక్తిగత ఎంపికలను సమర్థంగా నిర్వహిస్తున్నారని, వారి నిర్ణయాలను గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం తామిద్దరం ఒకరి లక్ష్యాలకు మరొకరం మద్దతు ఇచ్చుకుంటూ, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని సైనా తెలిపారు. ఈ జంట మళ్లీ కలవడంపై వారి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.