Aditya Dhar: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ. 1,006 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలోని ఒక పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా స్పందించారు.
సినిమాలో 'జస్కీరత్' అనే సిక్కు పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో సృష్టించిన నకిలీ చిత్రం అని ఆయన స్పష్టం చేశారు. తమ సినిమాలో కానీ, అధికారిక ప్రోమోల్లో కానీ అలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, సిక్కు సమాజంపై తమకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించేందుకు ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.