రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న సంక్షోభం నుంచి నేతన్నలను గట్టెక్కించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఆయన, సిరిసిల్ల నియోజకవర్గంలోని పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భేటీ అందరినీ ఆకట్టుకుంటోంది.
కేటీఆర్ వివరించిన సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. నేతన్నల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని, విద్యుత్ బకాయిల అంశాన్ని లోతుగా పరిశీలించి కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షోభ నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.