లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం
- భైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోరం
- మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు
- అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక అంచనా
మృతులను అనంతపురం జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించారు. వారు తమ పనుల మీద వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.