Narendra Modi: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాదిని శ్రీ పరాభవ నామ సంవత్సరంగా జరుపుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తెలుగులో ప్రత్యేకంగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఉగాది పండుగ సంప్రదాయాలకు నెలవుగా ఉంటూనే, నూతన శక్తికి, సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, విజయం, సంపూర్ణ ఆరోగ్యం నింపాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని, సమాజానికి సానుకూలంగా సేవలందించేలా ఈ ఏడాది స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పరాభవ నామ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం, అదృష్టం తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు. గతేడాది ఉగాది నాడు అన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా 'సన్నబియ్యం' పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తెలుగులో ప్రత్యేకంగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఉగాది పండుగ సంప్రదాయాలకు నెలవుగా ఉంటూనే, నూతన శక్తికి, సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, విజయం, సంపూర్ణ ఆరోగ్యం నింపాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని, సమాజానికి సానుకూలంగా సేవలందించేలా ఈ ఏడాది స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పరాభవ నామ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం, అదృష్టం తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు. గతేడాది ఉగాది నాడు అన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా 'సన్నబియ్యం' పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.