'రణబాలి' సాంగ్ కి పెరుగుతూపోతున్న క్రేజ్!

  • చారిత్రక నేపథ్యంతో 'రణబాలి'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక 
  • సంగీతాన్ని అందించిన అజయ్ - అతుల్ 
  • సెప్టెంబర్ 11వ తేదీన విడుదల

'రణబాలి' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండ అభిమానులు .. ఇటు రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పెళ్లి తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది కావడమే అందుకు కారణం. ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి సందర్భంగా, ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇది పెళ్లి నేపథ్యంలో చిత్రీకరించిన పాట కావడం విశేషం. 

'ఏందయ్యో సామి' అంటూ ఈ పాట సాగుతుంది. అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ బాణీ, యూత్ కి చాలా ఫాస్టుగా కనెక్ట్ అయింది. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. సాహిత్యం పరంగా కూడా ఈ పాట మంచి మార్కులు కొట్టేసింది. పెళ్లి సందర్భంలో వచ్చిన పాట కావడం వలన, ఈ పాట ఎక్కువమందికి రీచ్ అయ్యుండొచ్చని కొంతమంది అనుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ పాటను ఆస్వాదించేవారి సంఖ్య పెరుగుతూ వెళ్లడం విశేషం. 

యూత్ ఇప్పుడు ఈ సాంగ్ ను ఎక్కువగా వింటోంది .. చూస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మధురమైన మెలోడీగా ఈ పాటను గురించి చెప్పుకుంటున్నారు. ఆంగ్లేయుల కాలంలో వారి అరాచకాన్ని ఎదిరించి నిలిచిన ఒక రాయలసీమ వీరుడి కథ ఇది. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.



More Telugu News