మీ కలను నెరవేర్చా.. కానీ మీరు లేరు నాన్నా!: రింకూ సింగ్ భావోద్వేగం
- ప్రపంచకప్ గెలిచిన తర్వాత తండ్రిని తలచుకున్న రింకూ సింగ్
- నాన్న లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనంటూ భావోద్వేగ పోస్ట్
- కర్తవ్యమే ముఖ్యమని నాన్న చెప్పేవారని రింకూ వెల్లడి
- ఈ టోర్నీలో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయిన రింకూ
- రింకూ స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన
టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన ఆనందంలో దేశమంతా మునిగి తేలుతుంటే, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ మాత్రం తీవ్రమైన విషాదంలో ఉన్నాడు. ఈ చారిత్రక విజయం తర్వాత తన దివంగత తండ్రి ఖంచంద్ సింగ్ను గుర్తుచేసుకుంటూ అతను పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన తండ్రి లేకుండా ఈ విజయం అసంపూర్ణంగా అనిపిస్తోందని రింకూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి ఫొటోను పంచుకుంటూ రింకూ సింగ్ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు రాసుకొచ్చాడు. "మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ గడపలేదు. మీరు లేకుండా జీవితం ఎలా ముందుకు సాగుతుందో నాకు తెలియడం లేదు. కానీ, నా ప్రతి అడుగులో మీ అవసరం ఉంటుందని నాకు తెలుసు. కర్తవ్యమే ప్రథమం అని మీరు ఎప్పుడూ నాకు నేర్పించారు. అందుకే మైదానంలో మీ కలను నెరవేర్చేందుకే ప్రయత్నించాను. ఇప్పుడు మీ కల నెరవేరింది. కానీ, ఈ సంతోష సమయంలో మీరు నాతో ఉండుంటే బాగుండేది. ప్రతి చిన్న, పెద్ద ఆనందంలోనూ మీరు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను పాపా" అని రింకూ పేర్కొన్నాడు.
ఫిబ్రవరి 27న రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ అనారోగ్యంతో గ్రేటర్ నోయిడాలో కన్నుమూశారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్ ముగిసిన వెంటనే రింకూ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. వ్యక్తిగత విషాదంలో ఉన్నప్పటికీ జట్టు పట్ల తన బాధ్యతను మరవలేదు. వెంటనే కోల్కతాలో జట్టుతో కలిసి, వెస్టిండీస్తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం సిద్ధమయ్యాడు.
అయితే, ఈ ప్రపంచకప్లో రింకూ సింగ్ బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. టోర్నమెంట్లో ఆడిన 5 మ్యాచ్లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్లో డకౌట్ కావడం జట్టుపై ప్రభావం చూపింది. ఆ ఓటమి తర్వాత జట్టు యాజమాన్యం రింకూను పక్కనపెట్టి అతని స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇచ్చింది. ఈ మార్పు జట్టుకు మంచి ఫలితాలనిచ్చింది. కీలకమైన సూపర్ 8 చివరి మ్యాచ్, సెమీ ఫైనల్, ఫైనల్లో సంజూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో జట్టు ప్రపంచకప్ గెలిచినా, రింకూ సింగ్ వ్యక్తిగతంగా నిరాశతోనే టోర్నీని ముగించాల్సి వచ్చింది.
ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి ఫొటోను పంచుకుంటూ రింకూ సింగ్ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు రాసుకొచ్చాడు. "మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ గడపలేదు. మీరు లేకుండా జీవితం ఎలా ముందుకు సాగుతుందో నాకు తెలియడం లేదు. కానీ, నా ప్రతి అడుగులో మీ అవసరం ఉంటుందని నాకు తెలుసు. కర్తవ్యమే ప్రథమం అని మీరు ఎప్పుడూ నాకు నేర్పించారు. అందుకే మైదానంలో మీ కలను నెరవేర్చేందుకే ప్రయత్నించాను. ఇప్పుడు మీ కల నెరవేరింది. కానీ, ఈ సంతోష సమయంలో మీరు నాతో ఉండుంటే బాగుండేది. ప్రతి చిన్న, పెద్ద ఆనందంలోనూ మీరు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను పాపా" అని రింకూ పేర్కొన్నాడు.
ఫిబ్రవరి 27న రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ అనారోగ్యంతో గ్రేటర్ నోయిడాలో కన్నుమూశారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్ ముగిసిన వెంటనే రింకూ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. వ్యక్తిగత విషాదంలో ఉన్నప్పటికీ జట్టు పట్ల తన బాధ్యతను మరవలేదు. వెంటనే కోల్కతాలో జట్టుతో కలిసి, వెస్టిండీస్తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం సిద్ధమయ్యాడు.
అయితే, ఈ ప్రపంచకప్లో రింకూ సింగ్ బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. టోర్నమెంట్లో ఆడిన 5 మ్యాచ్లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్లో డకౌట్ కావడం జట్టుపై ప్రభావం చూపింది. ఆ ఓటమి తర్వాత జట్టు యాజమాన్యం రింకూను పక్కనపెట్టి అతని స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇచ్చింది. ఈ మార్పు జట్టుకు మంచి ఫలితాలనిచ్చింది. కీలకమైన సూపర్ 8 చివరి మ్యాచ్, సెమీ ఫైనల్, ఫైనల్లో సంజూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో జట్టు ప్రపంచకప్ గెలిచినా, రింకూ సింగ్ వ్యక్తిగతంగా నిరాశతోనే టోర్నీని ముగించాల్సి వచ్చింది.