టీ20 వరల్డ్ కప్ హీరో.. ఇన్‌స్టాలోనూ సరికొత్త రికార్డు

  • ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల ఫాలోవర్లను దాటిన సంజు శాంసన్
  • కేలం వారం రోజుల్లోనే 50 లక్షల మంది ఫాలోవర్ల పెరుగుదల
  • టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో పెరిగిన క్రేజ్
  • ఫాలోవర్ల సంఖ్యలో నటుడు దుల్కర్ సల్మాన్‌ను దాటేసిన సంజూ
టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల (1.7 కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని దాటాడు. ముఖ్యంగా గత ఏడు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మందికి పైగా కొత్త ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో కనబరిచిన అద్భుత ప్రదర్శనే అతని ఫాలోయింగ్ అమాంతం పెరగడానికి కారణమైంది.

టీ20 వరల్డ్ కప్‌లో సంజు కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. సూపర్-8లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

ఈ ప్రదర్శనల తర్వాత సోషల్ మీడియాలో సంజు పేరు మారుమోగింది. అభిమానులతో పాటు పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ, ఐసీసీ సైతం అతని ఆటను ప్రశంసించాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సంజును అభినందిస్తూ పోస్ట్ పెట్టడంతో అతని క్రేజ్ మరింత పెరిగింది. ఈ పరిణామాల ఫలితంగానే అతని ఫాలోవర్ల సంఖ్య రాకెట్ వేగంతో పెరిగింది.

కేరళలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు
ఈ ఫాలోవర్ల పెరుగుదలతో సంజు మరో ఘనతను కూడా సాధించాడు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అధిగమించాడు. దీంతో ప్రస్తుతం కేరళ నుంచి అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రముఖుల్లో ఒకరిగా సంజు శాంసన్ నిలిచాడు.


More Telugu News