చాంపియన్ టీమిండియాపై నోట్ల వర్షం.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
- టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టు
- విజేతగా రూ. 27.30 కోట్ల భారీ ప్రైజ్ మనీ
- గత ఏడాదితో పోలిస్తే రూ. 5 కోట్లు అదనం
- రన్నరప్ న్యూజిలాండ్కు రూ. 14.56 కోట్లు
- బీసీసీఐ నుంచి కూడా బోనస్ ప్రకటించే అవకాశం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తోంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి కప్ కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన కేవలం ట్రోఫీనే కాకుండా ఐసీసీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో నగదు బహుమతిని కూడా సొంతం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియాకు సుమారు రూ. 27.30 కోట్లు (3 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా లభించనున్నాయి.
ఈసారి ఐసీసీ మొత్తం ప్రైజ్ పూల్ను 20 శాతం పెంచి 13.5 మిలియన్ డాలర్లకు చేర్చడంతో విజేతకు అందే నగదు కూడా భారీగా పెరిగింది. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో కప్ గెలిచిన జట్టుకు అందిన రూ. 22.30 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 5 కోట్లు అధికం. మరోవైపు, ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు సుమారు రూ. 14.56 కోట్లు దక్కనున్నాయి.
ఐసీసీ నుంచి అధికారికంగా అందే ఈ భారీ ప్రైజ్ మనీతో పాటు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఆటగాళ్లకు ప్రత్యేకంగా భారీ బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ చారిత్రక విజయం ఆటగాళ్లకు ఆర్థికంగా కూడా ఓ మెగా జాక్పాట్గా నిలవనుంది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా, మైదానంలోనే కాకుండా ఆర్థికంగానూ కొత్త రికార్డులు సృష్టించింది.
ఈసారి ఐసీసీ మొత్తం ప్రైజ్ పూల్ను 20 శాతం పెంచి 13.5 మిలియన్ డాలర్లకు చేర్చడంతో విజేతకు అందే నగదు కూడా భారీగా పెరిగింది. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో కప్ గెలిచిన జట్టుకు అందిన రూ. 22.30 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 5 కోట్లు అధికం. మరోవైపు, ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు సుమారు రూ. 14.56 కోట్లు దక్కనున్నాయి.
ఐసీసీ నుంచి అధికారికంగా అందే ఈ భారీ ప్రైజ్ మనీతో పాటు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఆటగాళ్లకు ప్రత్యేకంగా భారీ బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ చారిత్రక విజయం ఆటగాళ్లకు ఆర్థికంగా కూడా ఓ మెగా జాక్పాట్గా నిలవనుంది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా, మైదానంలోనే కాకుండా ఆర్థికంగానూ కొత్త రికార్డులు సృష్టించింది.