వైవీ సుబ్బారెడ్డి భారీగా సంపాదించారు: బాలినేని శ్రీనివాసరెడ్డి

YV Subba Reddy Accumulated Wealth Alleges Balineni Srinivasa Reddy

టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదు కానీ, ఇతర అంశాల్లో మాత్రం భారీగా వెనకేశారని బాలినేని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే, అందరికంటే ఎక్కువగా సంతోషించే మొదటి వ్యక్తిని తానే అని అన్నారు.


తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతూ తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంగోలులో రెండుసార్లు ఓడిపోవడానికి కూటమి బలంగా ఉండటమే కారణమని విశ్లేషించారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళల నగదును కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. ఆ నిధులు కాజేసిన వైసీపీ నేతల పేర్లను బయటపెట్టి, వారిపై విచారణ జరిపించాలని కోరారు.

Go Back to Shorts
YV Subba Reddy
Balineni Srinivasa Reddy
TTD Chairman
Tirumala laddu
Andhra Pradesh Politics
YSRCP
Janasena
Chandrababu Naidu
Ongole
Corruption allegations

More Telugu News