శ్రీవారి సన్నిధిలో నిధి అగర్వాల్.. వీడియో ఇదిగో!

––
ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తిరుమల చేరుకున్న నిధి అగర్వాల్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో నిధి అగర్వాల్ కు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత నిధి అగర్వాల్ తో సెల్ఫీల కోసం భక్తులు ఉత్సాహం ప్రదర్శించారు.


More Telugu News