Chinna Reddy: రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

GHMC Zonal Officer Chinna Reddy Caught Taking Bribe
షార్ట్స్‌లో చూడండి
జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కాడు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఈరోజు జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని పత్రాలను పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

బిల్లులు మంజూరు చేయడానికి తనకు 15 లక్షల లంచం ఇవ్వాలని ఒక కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కార్యాలయంతో పాటు చిన్నారెడ్డి నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
Chinna Reddy
GHMC
Kukatpally
ACB
Bribery Case
Corruption
Telangana
Anti Corruption Bureau

More Telugu News