Farmers welfare: బడ్జెట్: రైతులకు నిర్మలమ్మ తీపి కబురు

Nirmala Sitharaman announces good news for farmers in budget
  • చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు
  • చేపల పెంపకం, పశు సంవర్థక శాఖలో భారీ ప్రోత్సాహకాలు
  • తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంచే రైతులకు ఊతం
కేంద్ర బడ్జెట్ లో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్‌ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Farmers welfare
Agriculture budget
Nirmala Sitharaman
Union Budget 2024
Coconut production
Cashew production
Fisheries development
Sandalwood farming
Horticulture sector

More Telugu News