షూటింగ్ మొదలవ్వకముందే సునామీ సృష్టిస్తున్న అల్లు అర్జున్- లోకేశ్ మూవీ

  • బన్నీ, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ
  • సినిమా గ్లింప్స్ వీడియోకు 35 లక్షలకు పైగా వ్యూస్
  • ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ఏఏ-23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఊహకందని స్థాయికి వెళ్ళిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వకముందే, కేవలం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.55 మిలియన్లకు (35 లక్షలకు) పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆ మ్యూజిక్ వింటుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుండటంతో, ప్రతి ఒక్కరూ ఆ ఆడియోను వాడుతూ రీల్స్ చేసేస్తున్నారు. ఈ అరుదైన ఘనతను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.


‘పుష్ప’ లాంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఒక నిమిషం గ్లింప్స్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే, ఇక ముందుముందు వచ్చే టీజర్, ట్రైలర్ ఇంకెన్ని రికార్డులను సాధిస్తాయో అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 


Allu Arjun
Allu Arjun movie
Lokesh Kanagaraj
AA23
Mythri Movie Makers
Anirudh Ravichander
Tollywood
Indian cinema
movie announcement
Pushpa

More Telugu News