భారత్పై 300 పరుగులు చేసినా సరిపోదేమో: కివీస్ కెప్టెన్ శాంట్నర్
- రెండో టీ20లో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన భారత్
- సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్
- 28 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపు
- ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన టీమిండియా
శుక్రవారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82 నాటౌట్), ఇషాన్ కిషన్ (76) విధ్వంసకర ఇన్నింగ్స్లతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్కు ఇది రెండో అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ శాంట్నర్ (47 నాటౌట్) రాణించడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. అయినప్పటికీ, భారత బ్యాటర్ల దూకుడు ముందు ఈ స్కోరు సరిపోలేదు.
ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను పరీక్షిస్తున్నామని, ఇలాంటి ఒత్తిడిలో ఆడటం వల్ల జట్టుకు మంచి పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని శాంట్నర్ పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ పాత్రపై స్పందిస్తూ, ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినప్పుడు పరుగులు చేయడం తన బాధ్యత అని, బౌలింగ్లోనూ రాణించాల్సి ఉంటుందని వివరించాడు. ఈ మ్యాచ్ ఫలితాలను పక్కనపెట్టి తర్వాతి మ్యాచ్పై దృష్టి పెడతామని ఆయన తెలిపాడు.