ప్రమాణ స్వీకారం.. 20 మంది తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్లకు హైకోర్టు నోటీసులు
- ప్రమాణ స్వీకారం సమయంలో బీజేపీ కౌన్సిలర్లు నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీపీఐ-ఎం కౌన్సిలర్ దీపక్
- బీజేపీ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కేరళ మునిసిపాలిటీ చట్టం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సీపీఐ-ఎం నాయకుడు, కౌన్సిలర్ ఎస్.పి. దీపక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వారికి నోటీసులు జారీ చేసింది.
కేసు తుది తీర్పు వచ్చే వరకు బీజేపీ కౌన్సిలర్లను కౌన్సిల్ సమావేశాల్లోకి అనుమతించవద్దని, గౌరవ వేతనం అందుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్లో పేర్కొన్న కౌన్సిలర్లు జి.ఎస్. ఆశానాథ్, చెంబళత్తి ఉదయన్, ఆర్. సుగతన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.