హైదరాబాద్లో కొందరు కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నారు: జీహెచ్ఎంసీ కమిషనర్
- పరిశుభ్రతలో నగరాన్ని అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యమన్న ఆర్వీ కర్ణన్
- స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ ఆరో ర్యాంకు సాధించిందన్న కర్ణన్
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2 వేల కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడి
హైదరాబాద్ నగరంలో కొందరు ఆస్తి పన్నును తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పరిశుభ్రతలో నగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో కృషి చేస్తామని ఆయన అన్నారు. 2025 స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ ఆరో ర్యాంకును సాధించిందని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు విస్తరించిందని అన్నారు.
వార్డులు కూడా 150 నుంచి 300కు పెరిగాయని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3 వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
జీఐఎస్ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగర పౌరులు తమ ఆస్తి పన్నును నేరుగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్, యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. హైదరాబాద్ నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపర్చేందుకు పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు.
వార్డులు కూడా 150 నుంచి 300కు పెరిగాయని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3 వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
జీఐఎస్ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగర పౌరులు తమ ఆస్తి పన్నును నేరుగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్, యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. హైదరాబాద్ నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపర్చేందుకు పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు.