Surya Charishma: బ్యాడ్మింటన్ పసిడి విజేత సూర్య చరిష్మకు సీఎం చంద్రబాబు అభినందనలు

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ షట్లర్ సూర్య చరిష్మపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సూర్య చరిష్మ సాధించిన విజయం అసాధారణమైన ఘనత అని, ఇది రాష్ట్ర క్రీడాకారిణుల ప్రతిభకు గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు.

విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 పోటీల్లో ఈ ఘనత నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్య చరిష్మ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇదే టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టీమ్ విభాగంలో రజత పతకం సాధించి సత్తా చాటింది. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో విజయాలతో వెలిగిపోతూ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తెస్తున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్య చరిష్మ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ విజయాలు రాష్ట్ర క్రీడారంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Surya Charishma
Surya Charishma badminton
Senior National Badminton Championship
Chandrababu Naidu
Andhra Pradesh sports
AP badminton team
Chennupati Ramakotaiah Indoor Stadium
Vijayawada
Badminton gold medal
Indian badminton

More Telugu News