Santoor: భారత్‌లో నంబర్ 1 సోప్‌గా సంతూర్.. ఏపీ నుంచే మొదలైన విజయ ప్రస్థానం

Santoor Becomes Number 1 Soap in India
షార్ట్స్‌లో చూడండి
భారత సబ్బుల మార్కెట్‌లో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్‌ లైటింగ్ సంస్థకు చెందిన 'సంతూర్' బ్రాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత 12 నెలల్లో అమ్మకాలు రూ. 2,850 కోట్లకు చేరడంతో ఇప్పటివరకు మార్కెట్ లీడర్‌గా ఉన్న లైఫ్‌బాయ్‌ను సంతూర్ అధిగమించింది.

'యవ్వనంగా కనిపించే చర్మం' అనే వాగ్దానంతో..
1985లో బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, 1986లో దేశవ్యాప్తంగా విడుదలైన సంతూర్.. గంధం, పసుపు మిశ్రమంతో 'యవ్వనంగా కనిపించే చర్మం' అనే వాగ్దానంతో వినియోగదారులను ఆకట్టుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ బ్రాండ్, తన విజయానికి కారణం వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, పటిష్ఠ‌మైన కార్యచరణ, పంపిణీ వ్యవస్థను విస్తరించడమేనని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా బ్రాండ్ ప్రచారంలో కీలకంగా నిలిచిన 'సంతూర్ మామ్' ప్రకటనలు ఎప్పటికప్పుడు మహిళల సామాజిక మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి.

సంతూర్ విజయ ప్రస్థానంలో ఏపీదే కీలక పాత్ర
సంతూర్ విజయ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించింది. 1990ల చివర్లో రాష్ట్రాలవారీగా విస్తరించాలని నిర్ణయించుకున్న విప్రో, తొలుత ఏపీపై దృష్టి సారించింది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లకు విస్తరించింది. 2012 నాటికి రూ. 1,000 కోట్ల అమ్మకాల మార్కును దాటిన సంతూర్, 2018లో రూ. 2,000 కోట్లతో లక్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. తాజాగా రూ. 2,850 కోట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్ 1 సోప్‌గా అవతరించింది.

ఈ మైలురాయిపై విప్రో కన్స్యూమర్ కేర్ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ, "వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడం, నాణ్యతలో రాజీ పడకపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. మా బృందాల అంకితభావం, భాగస్వాముల సహకారం మరువలేనిది" అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Santoor
Santoor soap
Wipro Consumer Care
Number 1 soap India
Lifebuoy
Viniet Agrawal
Soap market India
Santoor mom ad
Andhra Pradesh
Skin care

More Telugu News