రాంగ్రూట్లో వస్తే బండి సీజ్.. తెలంగాణలో 'అరైవ్.. అలైవ్' స్పెషల్ డ్రైవ్
- తెలంగాణలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు
- రాష్ట్రంలో రోజూ సగటున 20 మంది మృతి
- 'అరైవ్.. అలైవ్' పేరుతో పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
- హైవేలపై రాంగ్ రూట్లో వస్తే వాహనం అక్కడికక్కడే సీజ్
ఈ ప్రమాద ఘంటికల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కేవలం జరిమానాలతో మార్పు సాధ్యం కాదని భావించి, నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అరైవ్.. అలైవ్’ (Arrive.. Alive) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన తప్పిదాలపై ప్రత్యేక నిఘా పెట్టింది.
రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ముఖ్యంగా హైవేలపై రాంగ్రూట్లో ప్రయాణించే వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నారు. కేవలం శిక్షలే కాకుండా, మానవీయ కోణంలోనూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారి ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల అనుభవాలను వాహనదారులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వారి ఆవేదనను వినడం ద్వారానైనా వాహనదారుల్లో మార్పు వస్తుందని, తద్వారా రహదారులను సురక్షితంగా మార్చవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు.