హైదరాబాద్లో మారనున్న 3 వేల కాలనీల చిరునామాలు!
- జీహెచ్ఎంసీలో 27 శివారు పురపాలికల విలీనం
- 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగిన గ్రేటర్ పరిధి
- డివిజన్ల పునర్విభజనపై త్వరలో తుది గెజిట్ విడుదల
- 2027 జనాభా లెక్కల తర్వాత మరోసారి పునర్విభజన అవకాశం
ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న గ్రేటర్ పరిధి ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం డిసెంబర్ 1న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియ, డివిజన్ల పునర్విభజనను జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పూర్తి చేశారు.
కొత్త డివిజన్ల ఏర్పాటు, వాటి హద్దులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను అధికారులు పరిశీలించారు. శివరాంపల్లిని సులేమాన్నగర్లో కలపడం వంటి పలు అంశాలపై వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని హద్దుల్లో మార్పులు చేశారు. దీనికి సంబంధించిన తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫైనల్ గెజిట్ను విడుదల చేస్తుంది.
అయితే, ఇంత పెద్ద నగరాన్ని ఒకే గొడుగు కింద పాలించడంపై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. భవిష్యత్తులో జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2026లో జరగనున్న జనగణన తర్వాత, 2027లో వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లను మరోసారి పునర్విభజించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.