Andhra Pradesh: కొడుకు సమాధికి సీసీ కెమెరా ఏర్పాటు.. కారణం తెలిసి అంతా షాక్!

Father Installs CCTV Camera at Sons Grave in Tirupati Due to Black Magic Fears
షార్ట్స్‌లో చూడండి
కన్నకొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఓ తండ్రి.. తన బిడ్డ సమాధికి సీసీ కెమెరా ఏర్పాటు చేసిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. క్షుద్ర పూజల కోసం తన కుమారుడి మృతదేహాన్ని ఎవరైనా తవ్వేస్తారేమోనన్న భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన దంపతుల ఆరేళ్ల కుమారుడు ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. బాలుడిని ఊరి పొలిమేరల్లోని శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, సమాధి భద్రతపై ఆందోళన చెందాడు.

క్షుద్ర పూజలు చేసేవాళ్లు తన బిడ్డ మృతదేహాన్ని తవ్వేస్తారనే అనుమానంతో సమాధి వద్ద సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. దాని ఫుటేజీని రోజూ తన మొబైల్ ఫోన్‌లో చూస్తూ పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. చంద్రగిరి మండలంలో క్షుద్ర పూజల వంటి కార్యకలాపాలు జరగవని, ఈ విషయంలో ఆ కుటుంబానికి అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. అయినప్పటికీ పుత్రశోకంలో ఉన్న ఆ తండ్రి మాత్రం తన కొడుకు సమాధికి రక్షణగా సీసీ కెమెరా నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Tirupati district
Chandragiri
CCTV camera
Son's grave
Superstition
Black magic
Kshudra Pujalu
Grave security

More Telugu News