Lionel Messi: కోల్కతాలో మెస్సీ పర్యటనలో గందరగోళం కేసులో మరో ఇద్దరు అరెస్టు
- స్టేడియంలోని కుర్చీలని ధ్వంసం చేసి, గందరగోళం సృష్టించిన కేసు
- శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్టు
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఇండియాలో భాగంగా శనివారం కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు సోమవారం మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించినందుకు గాను శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.