Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ పర్యటనలో గందరగోళం కేసులో మరో ఇద్దరు అరెస్టు

Lionel Messi Kolkata Event Two More Arrested in Chaos Case
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఇండియాలో భాగంగా శనివారం కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు సోమవారం మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించినందుకు గాను శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Lionel Messi
Messi Kolkata visit
Goat Tour India
Kolkata event chaos
Shatadru Datta

More Telugu News