ఉపాసన కీలక ప్రకటన.. తెలంగాణలో అపోలో భారీ ప్రణాళిక

  • తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడులకు సిద్ధం
  • రానున్న మూడేళ్లలో రూ.1700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఉపాసన ప్రకటన
  • మహిళలు, యువత సాధికారతే లక్ష్యంగా 24 వేల ఉద్యోగాల కల్పన
  • తమ ఫార్మసీల ద్వారా ఏటా 2.6 లక్షల కుటుంబాలకు అండ‌గా ఉంటున్నామ‌న్న ఉపాస‌న‌
తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అపోలో గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో రూ.1700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ సీఎస్ఆర్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 24 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ మేరకు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణకు తమ అపోలో కుటుంబం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, యువత సాధికారతే లక్ష్యంగా ఈ ఉద్యోగాల కల్పన ఉంటుందని ఆమె వివరించారు.

తమ గ్రూప్‌కు చెందిన వెయ్యికి పైగా ఫార్మసీల ద్వారా ఇప్పటికే ఏటా 2,62,749 కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ఉపాసన తెలిపారు. ఈ కొత్త పెట్టుబడులతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేయాలనేది తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తాజా పెట్టుబడి ప్రకటనతో తెలంగాణ ఆరోగ్య రంగంలో మరిన్ని అవకాశాలు మెరుగుపడనున్నాయి.


More Telugu News