ఎన్నికల్లో ఓట‌మి... మౌన దీక్ష చేపట్టిన ప్రశాంత్ కిశోర్

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష
  • పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమంలో ఒక రోజు పాటు దీక్ష
  • మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి దీక్ష ప్రారంభం
  • మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన పీకే
రాజకీయ వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ఒక రోజు మౌన దీక్ష చేపట్టారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆత్మపరిశీలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం పశ్చిమ చంపారన్ జిల్లాలోని చారిత్రక భితిహర్వా ఆశ్రమంలో ఆయన ఈ మౌన వ్రతాన్ని పాటించారు.

సుమారు వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. గాంధీ సిద్ధాంతాలను ఎంతగానో ఆరాధించే ప్రశాంత్ కిశోర్, తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి వంటి సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు. దీక్ష ప్రారంభించడానికి ముందు ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మూడేళ్ల క్రితం తన 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను ప్రశాంత్ కిశోర్ ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించడం గమనార్హం. ఆ పాదయాత్ర ముగిశాక, గతేడాది గాంధీ జయంతి రోజున ఆయన జన్ సూరజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో అదే గాంధీ స్ఫూర్తి కేంద్రమైన ఆశ్రమంలో మౌన దీక్ష చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Prashant Kishor
Jan Suraaj Party
Bihar Assembly Elections
Bitharwa Ashram
West Champaran
Mouna Deeksha
Political Strategist
Mahatma Gandhi
Manoj Bharathi
Bihar Politics

More Telugu News