డ్రైవింగ్ లైసెన్స్ కావాలా?.. ఇకపై ఏపీ ఆర్టీఏ ఆఫీసులో టెస్ట్ అవసరం లేదు!
- డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కొత్త నిబంధనలు
- రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు
- శిక్షణ పూర్తి చేస్తే ఆర్టీఏలో టెస్ట్ లేకుండానే లైసెన్స్
- అదనంగా 5 ప్రాంతీయ శిక్షణ కేంద్రాలకు ఆమోదం
- కేంద్ర రవాణా శాఖ నుంచి భారీగా ఆర్థిక సాయం
- ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
ఏపీలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానాన్ని మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరైన శిక్షణ లేకుండానే లైసెన్సులు పొందడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ, ఈ ప్రక్రియలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (డీటీసీ), 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల (ఆర్డీటీసీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
టెస్ట్ లేకుండానే లైసెన్స్
ఈ కొత్త విధానంలో భాగంగా, డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తిచేసిన వారికి రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాల్సిన అవసరం ఉండదు. డీటీసీ నుంచి పొందిన శిక్షణ సర్టిఫికెట్ ఆధారంగా వారికి నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. ఈ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు భారీ వాహనాలకు కూడా శిక్షణ ఇస్తారు. తరగతి గదిలో నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, సిమ్యులేటర్లపై ప్రాక్టీస్, ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్లపై డ్రైవింగ్ నేర్పించడం వంటివి ఈ శిక్షణలో భాగంగా ఉంటాయి. ఏ లైసెన్సుకు ఎంత కాలం శిక్షణ ఇవ్వాలి, ఫీజులు ఎంత ఉండాలనే వివరాలను కేంద్ర రవాణా శాఖ ఖరారు చేస్తుంది.
ఆర్డీటీసీల్లో అక్కడికక్కడే లైసెన్స్ జారీ
రాష్ట్రానికి మంజూరైన 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను (ఆర్డీటీసీ) ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో శిక్షణ పొందిన వారికి మరింత సౌలభ్యంగా ఉంటుంది. వారు లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా, శిక్షణ కేంద్రంలోనే దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందవచ్చు.
కేంద్రం ఆర్థిక సాయం.. దరఖాస్తుల ఆహ్వానం
డీటీసీ ఏర్పాటుకు కనీసం 2 ఎకరాల స్థలం అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి అయ్యే ఖర్చులో 85% వరకు (గరిష్ఠంగా రూ.2.5 కోట్లు) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అదేవిధంగా, ఆర్డీటీసీ ఏర్పాటుకు 3 ఎకరాల భూమి అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్ల వరకు కేంద్రం నిధులు సమకూరుస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు తమ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి రెండేసి దరఖాస్తులు రాగా, అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కో దరఖాస్తు అందింది. వీటిలో అనంతపురం జిల్లాలోని ఒక డీటీసీకి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే ఆర్డీటీసీల ఏర్పాటుకు ఇంకా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జనవరి చివరి వరకు దరఖాస్తులు స్వీకరించి, ఫిబ్రవరి నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టెస్ట్ లేకుండానే లైసెన్స్
ఈ కొత్త విధానంలో భాగంగా, డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తిచేసిన వారికి రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాల్సిన అవసరం ఉండదు. డీటీసీ నుంచి పొందిన శిక్షణ సర్టిఫికెట్ ఆధారంగా వారికి నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. ఈ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు భారీ వాహనాలకు కూడా శిక్షణ ఇస్తారు. తరగతి గదిలో నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, సిమ్యులేటర్లపై ప్రాక్టీస్, ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్లపై డ్రైవింగ్ నేర్పించడం వంటివి ఈ శిక్షణలో భాగంగా ఉంటాయి. ఏ లైసెన్సుకు ఎంత కాలం శిక్షణ ఇవ్వాలి, ఫీజులు ఎంత ఉండాలనే వివరాలను కేంద్ర రవాణా శాఖ ఖరారు చేస్తుంది.
ఆర్డీటీసీల్లో అక్కడికక్కడే లైసెన్స్ జారీ
రాష్ట్రానికి మంజూరైన 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను (ఆర్డీటీసీ) ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో శిక్షణ పొందిన వారికి మరింత సౌలభ్యంగా ఉంటుంది. వారు లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా, శిక్షణ కేంద్రంలోనే దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందవచ్చు.
కేంద్రం ఆర్థిక సాయం.. దరఖాస్తుల ఆహ్వానం
డీటీసీ ఏర్పాటుకు కనీసం 2 ఎకరాల స్థలం అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి అయ్యే ఖర్చులో 85% వరకు (గరిష్ఠంగా రూ.2.5 కోట్లు) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అదేవిధంగా, ఆర్డీటీసీ ఏర్పాటుకు 3 ఎకరాల భూమి అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్ల వరకు కేంద్రం నిధులు సమకూరుస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు తమ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి రెండేసి దరఖాస్తులు రాగా, అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కో దరఖాస్తు అందింది. వీటిలో అనంతపురం జిల్లాలోని ఒక డీటీసీకి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే ఆర్డీటీసీల ఏర్పాటుకు ఇంకా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జనవరి చివరి వరకు దరఖాస్తులు స్వీకరించి, ఫిబ్రవరి నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.