వన్ విజన్-వన్ డైరెక్షన్.. ఇదే ప్రభుత్వ విధానం: చంద్రబాబునాయుడు
- సమాచార క్రోడీకరణతో మెరుగైన పాలన
- ప్రభుత్వం అందించే పౌర సేవలకు రేటింగ్లు ఇస్తాం
- ఆన్లైన్ సేవల ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు లేకుండా చేయాలి
- కలిసి పని చేద్దాం... కలిసి విజయం సాధిద్దామని పిలుపు
- సాంకేతికతను వినియోగిస్తే ఖర్చులూ తగ్గించొచ్చు
- ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం చేయొద్దు
- డేటా ఆధారిత పాలనపై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
'వన్ విజన్-వన్ డైరెక్షన్' ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి? సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు? డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించాం. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్ధవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం"అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సమాచార సేకరణ-క్రోడీకరణతో మెరుగైన సేవలు
"ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్లోనే విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ముందుగా అంచనాలు వేయడం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించండం అనేది సాంకేతికత ద్వారా సాధ్యం అవుతోంది. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నాం. నిధుల వ్యయం సమర్ధంగా జరగాలి.
ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్ను సమర్ధంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. దేవాదాయశాఖ అందిస్తున్న సేవల విషయంలో భక్తులు అంతా క్షేత్రస్థాయికి వస్తారు. రెవెన్యూ సహా ఇతర శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే అందాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.
ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని సరిచూసుకోవాలి. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉంది. అలాగే ప్రజల నుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు సరిగ్గా వ్యవహరించాలి. ఆర్దికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం జరగటం సరికాదు. ఈ పరిస్థితి మారాలి. అలాగే జరుగుతున్న పరిణామాలు ఆధారంగా ఎప్పటికప్పుడు అలెర్ట్ అవ్వాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అలాంటివి జరగ్గకుండా చూసుకోవాలి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఆ మేరకు ప్రామాణికాలు రూపొందించుకుని అటువంటి తప్పిదాలు మళ్లీ జరగ్గకుండా చూసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు.
పారదర్శకత పాటించాలి
"గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత భాద్యతగా వ్యవహరించాలి. అలాగే ఎక్సైజ్ శాఖలోనూ గత ప్రభుత్వంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి అపోహల నుంచి ప్రజలకు అవగాహన కల్పించి వాస్తవాలు వివరించాలి. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలి. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్కు అనుసంధానం కావాలి. సాంకేతిక వినియోగంతో వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టేందుకు ఈ టెక్నాలజీని వినియోగించక తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత పాలనలో వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయి. రాష్ట్రాన్ని ఇలా వదిలేయలేం. దానిని పునరుద్ధరించి అగ్రస్థానానికి తీసుకెళ్తాం.
ఏపీ ఉపయోగించుకున్నంతగా సాంకేతికతను ఏ రాష్ట్రమూ వినియోగించుకోవటం లేదు. సింగిల్ టీమ్, సింగిల్ అప్రోచ్, సింగిల్ థీమ్తో అంతా పనిచేద్దాం. రాష్ట్ర అభివృద్ది విషయంలో ఎలాంటి రాజీ లేదు. అధికార యంత్రాంగం అంతా బాధ్యతతో పనిచేయాల్సిందే. ఎక్కడా నిర్లక్ష్యానికి, అలసత్వానికి అవకాశం లేదు. గత పాలకులు అన్ని శాఖల పనితీరునూ దెబ్బతీశారు. వాటిని పునరుద్ధరించే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో అంతా టీమ్గా కలిసి పనిచేయాలి. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించే చర్యలూ తీసుకుంటున్నాం. ప్రభుత్వ యంత్రాంగం అందించే నాణ్యమైన సేవలతోనే రాష్ట్రస్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. 15 శాతం వృద్ధిరేటు దిశగా మనం అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో బాధ్యతతో కూడిన ప్రభుత్వం ఉంది కాబట్టే గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.
ప్రభుత్వ శాఖలు 100 శాతం ఆన్ లైన్ సర్వీసులను ప్రజలకు అందించాలి. పెన్షన్ పంపిణీ, ఆర్టీసీ, రేషన్ వంటి సేవల్లో మంచి పనితీరు కనపడుతోంది. కానీ పారిశుద్ద్యం విషయంలో ఆర్టీసీ కొంత వెనకబాటులో ఉంది. కొన్ని శాఖలు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంది. మున్సిపల్, ఎలక్ట్రిసిటీ విభాగాల సేవలు మరితంగా మెరుగవ్వాలి. ఇసుక సరఫరా సేవలు మరింత మెరుగుపడాలి. రిజిస్ట్రేషన్ విభాగంలో సేవల సంతృప్తి స్థాయి 62-70 శాతానికి చేరింది. రెవెన్యూ లాంటి ప్రభుత్వ శాఖలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు గడువు మేరకు పూర్తి కావాలి. ఆన్లైన్, వాట్సాప్ సేవలు, పీపుల్స్ టచ్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే మన లక్ష్యం. ఫైళ్ల క్లియరెన్సు విషయంలో ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్సు కోసం రోజుల సమయాన్ని తీసుకోవటం సరికాదు. కొందరు మంత్రుల పనితీరు బాగా మెరుగుపర్చుకోవాలి. ఫైళ్లు క్లియర్ చేయటంలో ఆలస్యం జరగకూడదు. ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు రేటింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం" అని చంద్రబాబు చెప్పారు.
సాంకేతిక వినియోగంతో ఖర్చులూ తగ్గించవచ్చు
"నీటి వనరుల విషయంలోనూ రియల్ టైమ్లోనే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. రీఛార్జి చేయటంతో పాటు భూగర్భజలాలను పెంచుకుంటే కరవు అనే పరిస్థితే ఉండదు. ఉచిత విద్యుత్ నిమిత్తం రైతులకు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నాం. భూగర్భజలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గి రూ.4500 కోట్ల వ్యయం తగ్గించుకోవచ్చు. అలాగే వైద్యారోగ్య శాఖలోనూ వనరుల సమర్ధ నిర్వహణ ద్వారా ప్రిడిక్టివ్ అనాలసిస్ ద్వారా వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అప్పుడు డేటానే మనకు అద్భుతమైన సంపదగా మారుతుంది. భూ సంబంధిత వ్యవహరాల్లో లిటిగేషన్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చు. బాధ్యతగా పనిచేస్తూ ముందుకెళ్దాం. సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించండి.
అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి.
మొంథా తుపానులో పని చేసిన విధంగానే పరిపాలనలోనూ పనిచేయాలి. మొంథా తుఫాన్ సందర్భంగా కన్పించిన టీం స్పిరిట్ అన్ని చోట్లా కన్పించాలి. ఇదో మోడల్ గా తీసుకుని కలసి పనిచేద్దాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా పనితీరు మెరుగుపర్చుకోకపోతే అది నిర్లక్ష్యమే. రాష్ట్ర అభివృద్ధి, విజన్ లక్ష్యాల సాధనలో అన్ని శాఖలూ సమన్వయంగా పనిచేయాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలి. సామాజిక, శాంతిభద్రతల ఇండికేటర్లు కూడా విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రజలకు అందే సేవల విషయంలో కాంట్రాక్టర్లకు సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయాల్సిందే. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోతే సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే"అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అధికారులు సాంకేతికతను తమ తమ శాఖల్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. సాంకేతికతను వినియోగించుకుని విశ్లేషణలు చేసుకోవడం ద్వారా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎగవేతలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు.
ఇక ఈ-వేబిల్స్ ద్వారా ఎక్కడా ఎగవేతలు లేకుండా చూస్తున్నామని, రెవెన్యూ నష్టం లేకుండా సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. గడచిన 25 రోజులుగా సురక్షా యాప్ స్కాన్ చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటి వరకూ ఒక్క నకిలీ బాటిల్ కూడా లభ్యం కాలేదని చెప్పారు. మద్యం కొనుగోళ్లు చేసే సమయంలో యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనే అంశాన్ని మరింతగా ప్రచారం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మైనింగ్ ఆదాయం మరింతగా వృద్ధి చేసుకునే విషయంలో టెక్నాలజీని అనుసంధానిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి? సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు? డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించాం. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్ధవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం"అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సమాచార సేకరణ-క్రోడీకరణతో మెరుగైన సేవలు
"ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్లోనే విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ముందుగా అంచనాలు వేయడం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించండం అనేది సాంకేతికత ద్వారా సాధ్యం అవుతోంది. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నాం. నిధుల వ్యయం సమర్ధంగా జరగాలి.
ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్ను సమర్ధంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. దేవాదాయశాఖ అందిస్తున్న సేవల విషయంలో భక్తులు అంతా క్షేత్రస్థాయికి వస్తారు. రెవెన్యూ సహా ఇతర శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే అందాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.
ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని సరిచూసుకోవాలి. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉంది. అలాగే ప్రజల నుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు సరిగ్గా వ్యవహరించాలి. ఆర్దికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం జరగటం సరికాదు. ఈ పరిస్థితి మారాలి. అలాగే జరుగుతున్న పరిణామాలు ఆధారంగా ఎప్పటికప్పుడు అలెర్ట్ అవ్వాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అలాంటివి జరగ్గకుండా చూసుకోవాలి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఆ మేరకు ప్రామాణికాలు రూపొందించుకుని అటువంటి తప్పిదాలు మళ్లీ జరగ్గకుండా చూసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు.
పారదర్శకత పాటించాలి
"గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత భాద్యతగా వ్యవహరించాలి. అలాగే ఎక్సైజ్ శాఖలోనూ గత ప్రభుత్వంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి అపోహల నుంచి ప్రజలకు అవగాహన కల్పించి వాస్తవాలు వివరించాలి. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలి. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్కు అనుసంధానం కావాలి. సాంకేతిక వినియోగంతో వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టేందుకు ఈ టెక్నాలజీని వినియోగించక తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత పాలనలో వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయి. రాష్ట్రాన్ని ఇలా వదిలేయలేం. దానిని పునరుద్ధరించి అగ్రస్థానానికి తీసుకెళ్తాం.
ఏపీ ఉపయోగించుకున్నంతగా సాంకేతికతను ఏ రాష్ట్రమూ వినియోగించుకోవటం లేదు. సింగిల్ టీమ్, సింగిల్ అప్రోచ్, సింగిల్ థీమ్తో అంతా పనిచేద్దాం. రాష్ట్ర అభివృద్ది విషయంలో ఎలాంటి రాజీ లేదు. అధికార యంత్రాంగం అంతా బాధ్యతతో పనిచేయాల్సిందే. ఎక్కడా నిర్లక్ష్యానికి, అలసత్వానికి అవకాశం లేదు. గత పాలకులు అన్ని శాఖల పనితీరునూ దెబ్బతీశారు. వాటిని పునరుద్ధరించే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో అంతా టీమ్గా కలిసి పనిచేయాలి. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించే చర్యలూ తీసుకుంటున్నాం. ప్రభుత్వ యంత్రాంగం అందించే నాణ్యమైన సేవలతోనే రాష్ట్రస్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. 15 శాతం వృద్ధిరేటు దిశగా మనం అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో బాధ్యతతో కూడిన ప్రభుత్వం ఉంది కాబట్టే గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.
ప్రభుత్వ శాఖలు 100 శాతం ఆన్ లైన్ సర్వీసులను ప్రజలకు అందించాలి. పెన్షన్ పంపిణీ, ఆర్టీసీ, రేషన్ వంటి సేవల్లో మంచి పనితీరు కనపడుతోంది. కానీ పారిశుద్ద్యం విషయంలో ఆర్టీసీ కొంత వెనకబాటులో ఉంది. కొన్ని శాఖలు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంది. మున్సిపల్, ఎలక్ట్రిసిటీ విభాగాల సేవలు మరితంగా మెరుగవ్వాలి. ఇసుక సరఫరా సేవలు మరింత మెరుగుపడాలి. రిజిస్ట్రేషన్ విభాగంలో సేవల సంతృప్తి స్థాయి 62-70 శాతానికి చేరింది. రెవెన్యూ లాంటి ప్రభుత్వ శాఖలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు గడువు మేరకు పూర్తి కావాలి. ఆన్లైన్, వాట్సాప్ సేవలు, పీపుల్స్ టచ్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే మన లక్ష్యం. ఫైళ్ల క్లియరెన్సు విషయంలో ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్సు కోసం రోజుల సమయాన్ని తీసుకోవటం సరికాదు. కొందరు మంత్రుల పనితీరు బాగా మెరుగుపర్చుకోవాలి. ఫైళ్లు క్లియర్ చేయటంలో ఆలస్యం జరగకూడదు. ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు రేటింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం" అని చంద్రబాబు చెప్పారు.
సాంకేతిక వినియోగంతో ఖర్చులూ తగ్గించవచ్చు
"నీటి వనరుల విషయంలోనూ రియల్ టైమ్లోనే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. రీఛార్జి చేయటంతో పాటు భూగర్భజలాలను పెంచుకుంటే కరవు అనే పరిస్థితే ఉండదు. ఉచిత విద్యుత్ నిమిత్తం రైతులకు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నాం. భూగర్భజలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గి రూ.4500 కోట్ల వ్యయం తగ్గించుకోవచ్చు. అలాగే వైద్యారోగ్య శాఖలోనూ వనరుల సమర్ధ నిర్వహణ ద్వారా ప్రిడిక్టివ్ అనాలసిస్ ద్వారా వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అప్పుడు డేటానే మనకు అద్భుతమైన సంపదగా మారుతుంది. భూ సంబంధిత వ్యవహరాల్లో లిటిగేషన్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చు. బాధ్యతగా పనిచేస్తూ ముందుకెళ్దాం. సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించండి.
అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి.
మొంథా తుపానులో పని చేసిన విధంగానే పరిపాలనలోనూ పనిచేయాలి. మొంథా తుఫాన్ సందర్భంగా కన్పించిన టీం స్పిరిట్ అన్ని చోట్లా కన్పించాలి. ఇదో మోడల్ గా తీసుకుని కలసి పనిచేద్దాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా పనితీరు మెరుగుపర్చుకోకపోతే అది నిర్లక్ష్యమే. రాష్ట్ర అభివృద్ధి, విజన్ లక్ష్యాల సాధనలో అన్ని శాఖలూ సమన్వయంగా పనిచేయాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలి. సామాజిక, శాంతిభద్రతల ఇండికేటర్లు కూడా విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రజలకు అందే సేవల విషయంలో కాంట్రాక్టర్లకు సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయాల్సిందే. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోతే సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే"అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అధికారులు సాంకేతికతను తమ తమ శాఖల్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. సాంకేతికతను వినియోగించుకుని విశ్లేషణలు చేసుకోవడం ద్వారా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎగవేతలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు.
ఇక ఈ-వేబిల్స్ ద్వారా ఎక్కడా ఎగవేతలు లేకుండా చూస్తున్నామని, రెవెన్యూ నష్టం లేకుండా సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. గడచిన 25 రోజులుగా సురక్షా యాప్ స్కాన్ చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటి వరకూ ఒక్క నకిలీ బాటిల్ కూడా లభ్యం కాలేదని చెప్పారు. మద్యం కొనుగోళ్లు చేసే సమయంలో యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనే అంశాన్ని మరింతగా ప్రచారం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మైనింగ్ ఆదాయం మరింతగా వృద్ధి చేసుకునే విషయంలో టెక్నాలజీని అనుసంధానిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.