రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మహిళల వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

  • ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ పోరు
  • భారత్, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ కోసం కీలక మ్యాచ్
  • నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఫైనల్
  • ఎట్టకేలకు కరుణించిన వరుణుడు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • తొలుత బ్యాటింగ్ చేయనున్న హర్మన్‌ప్రీత్ సేన
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ టాస్ గెలిచి, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆడుతున్న జట్ల వివరాలు

భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.

దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మరిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నడిన్ డి క్లర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులెలెకో మ్లాబా.


More Telugu News