Musi River: శాంతించిన మూసీ.. ఎంజీబీఎస్‌లో బురద తొలగింపు పనులు వేగవంతం

Musi River calms down MGBS cleanup accelerates
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరానికి ఊరట లభించింది. మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గడంతో నగరంలోని కీలకమైన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. వరద నీరు వెనక్కి వెళ్లినప్పటికీ, బస్ స్టేషన్ ప్రాంగణంలో భారీగా బురద పేరుకుపోయింది. దీంతో ఆర్టీసీ అధికారులు పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేశారు.

ముఖ్యంగా ఎంజీబీఎస్‌కు వచ్చే దారిలోని శివాజీ బ్రిడ్జి వద్ద, బస్ స్టేషన్‌లోని 56, 58, 60 నంబర్ ప్లాట్‌ఫారాల వద్ద బురద పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రపరిచే పనులను చేపట్టారు. బురదను పూర్తిగా తొలగించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి బస్సులను తిరిగి ఎంజీబీఎస్‌లోకి అనుమతించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులను నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పికప్ పాయింట్లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ తాత్కాలిక పికప్ పాయింట్ల నుంచే బస్సులు ఎక్కాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Musi River
Hyderabad floods
MGBS bus station
Telangana RTC
Shivaji Bridge
Hyderabad rain
Aramghar
LB Nagar
Uppal
JBS

More Telugu News