పాకిస్థాన్ మాటలకే పరిమితం.. గెలుపు మనదేనన్న అమిత్ మిశ్రా
- రేపు పాకిస్థాన్ తో ఆసియా కప్ ఫైనల్
- భారత్ ఫీల్డింగ్పై కాస్త దృష్టి పెడితే చాలన్న అమిత్ మిశ్రా
- టీమిండియా సమష్టిగా రాణిస్తోందని ప్రశంస
ఆసియా కప్లో తొమ్మిదోసారి ఛాంపియన్గా నిలిచేందుకు టీమిండియా అడుగు దూరంలో ఉంది. రేపు జరగనున్న ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా ఫైనల్కు దూసుకొచ్చిన భారత జట్టుపై మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రశంసలు కురిపించాడు. ఈసారి కూడా పాకిస్థాన్పై భారత్దే పైచేయి అవుతుందని, పాక్ జట్టు కేవలం మాటలకే పరిమితమని జోస్యం చెప్పాడు.
భారత్తో పోలిస్తే పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉందని అమిత్ మిశ్రా విశ్లేషించాడు. "టీ20 ఫార్మాట్లో టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ అన్ని రంగాల్లో అసాధారణంగా రాణించాలి. కానీ ప్రస్తుత పాక్ జట్టును చూస్తే ఆ లక్షణాలు కనిపించడం లేదు. ఒత్తిడిని అధిగమించడంలో వారు విఫలమవుతున్నారు. కొందరు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను గుర్తుచేస్తున్నారు. కానీ ఈసారి అలాంటి ఫలితం పునరావృతం కాదు" అని మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు.
అయితే, టీమిండియాకు అమిత్ మిశ్రా ఒక కీలక సూచన చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్లను జారవిడిచారని, ఫైనల్లో అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించాడు. "టీ20 క్రికెట్లో ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపం మారిపోవచ్చు. కాబట్టి ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదు. ఫీల్డింగ్పై కాస్త దృష్టి సారిస్తే భారత్కు తిరుగుండదు" అని తెలిపాడు.
ప్రస్తుత భారత జట్టు సమష్టిగా రాణిస్తోందని మిశ్రా కొనియాడాడు. "ఈ టోర్నీలో జట్టు ఒక్కరిపైనే ఆధారపడటం లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన ఆరంభాలు ఇస్తున్నాడు. శుభ్మన్ గిల్ అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. మిడిలార్డర్లో సంజు శాంసన్, తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె కూడా బ్యాట్, బంతితో రాణిస్తున్నారు. ఇది జట్టుకు అదనపు బలం" అని అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాకిస్థాన్ను ఓడించిన భారత్, అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.
భారత్తో పోలిస్తే పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉందని అమిత్ మిశ్రా విశ్లేషించాడు. "టీ20 ఫార్మాట్లో టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ అన్ని రంగాల్లో అసాధారణంగా రాణించాలి. కానీ ప్రస్తుత పాక్ జట్టును చూస్తే ఆ లక్షణాలు కనిపించడం లేదు. ఒత్తిడిని అధిగమించడంలో వారు విఫలమవుతున్నారు. కొందరు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను గుర్తుచేస్తున్నారు. కానీ ఈసారి అలాంటి ఫలితం పునరావృతం కాదు" అని మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు.
అయితే, టీమిండియాకు అమిత్ మిశ్రా ఒక కీలక సూచన చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్లను జారవిడిచారని, ఫైనల్లో అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించాడు. "టీ20 క్రికెట్లో ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపం మారిపోవచ్చు. కాబట్టి ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదు. ఫీల్డింగ్పై కాస్త దృష్టి సారిస్తే భారత్కు తిరుగుండదు" అని తెలిపాడు.
ప్రస్తుత భారత జట్టు సమష్టిగా రాణిస్తోందని మిశ్రా కొనియాడాడు. "ఈ టోర్నీలో జట్టు ఒక్కరిపైనే ఆధారపడటం లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన ఆరంభాలు ఇస్తున్నాడు. శుభ్మన్ గిల్ అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. మిడిలార్డర్లో సంజు శాంసన్, తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె కూడా బ్యాట్, బంతితో రాణిస్తున్నారు. ఇది జట్టుకు అదనపు బలం" అని అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాకిస్థాన్ను ఓడించిన భారత్, అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.