ఇండియా-పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత... పాక్ ఆటగాళ్లను హేళన చేసిన లేడీ ఫ్యాన్... వీడియో ఇదిగో

  • సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం
  • "ఓడిపోయారు, ఇంటికి వెళ్లండి" అంటూ స్టేడియంలో గట్టిగా అరిచిన భారత మహిళా అభిమాని 
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటనకు సంబంధించిన వీడియో
  • భారత అభిమాని తీరును సమర్థిస్తూ నెటిజన్ల నుంచి కామెంట్లు
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసియాకప్ టీ20 టోర్నీలో నిన్న జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ అనంతరం అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ భారత మహిళా అభిమాని... ఓటమి పాలైన పాకిస్థాన్ ఆటగాళ్లను ఉద్దేశించి ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, మ్యాచ్ ముగిశాక పాకిస్థాన్ క్రీడాకారులు మైదానం వీడి పెవిలియన్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఓ భారత యువతి, వారిని రెచ్చగొట్టేలా గట్టిగా అరవడం ప్రారంభించింది. "మీరు ఓడిపోయారు... ఇక ఇంటికి వెళ్ళండి... బై బై పాకిస్థాన్" అంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అయింది. 

ఈ వీడియో చూసిన భారత అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ యువతి పాకిస్థాన్ జట్టు పరువు తీసిందంటూ కామెంట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిన్న జరిగిన ఈ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ తమ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 


More Telugu News