తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేశ్ భేటీ
- కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం
- ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై వివరించిన లోకేశ్
- డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి అని వివరణ
- దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా సంస్కరణలు అని వెల్లడి
- రాష్ట్ర పర్యటనకు రావాలని అన్నామలైకి ప్రత్యేక ఆహ్వానం
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల (డబుల్ ఇంజన్ సర్కార్) ఏపీ శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పనితీరును, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆయన తెలియజేశారు.
ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తున్న సంస్కరణలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేశ్ తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని, ఇక్కడి పాలనను పరిశీలించాలని అన్నామలైని ఆయన రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు.