మోదీ చైనా పర్యటనపై ఇటు రాజ్ నాథ్, అటు చైనా ఎంబసీ స్పందన
- శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న రక్షణ మంత్రి
- దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య
- గణేశుడి ప్రతిమల చిత్రాలను పోస్ట్ చేసిన చైనా ఎంబసీ
చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్..
తమ దేశంలో మోదీ పర్యటన నేపథ్యంలో చైనా ఎంబసీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. భారత్, చైనాల మధ్య సాంస్కృతిక సంబంధాలను చాటిచెప్పే చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి. శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇదొక అందమైన ప్రతీక’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ జత చేసింది.