Mohammed Shami: రంజాన్ సమయంలో ఎనర్జీ డ్రింక్ ఎందుకు తాగానంటే.. విమర్శకులకు షమీ సమాధానం

Mohammed Shami Explains Energy Drink During Ramadan Criticism
షార్ట్స్‌లో చూడండి
రంజాన్ ఉపవాస దీక్షపై వస్తున్న విమర్శలపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు స్పందించాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కఠిన పరిస్థితుల్లో కొన్నిసార్లు మతపరమైన నియమాలకు మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు.

ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఈ విషయంపై మాట్లాడాడు. "మేము 42 నుంచి 45 డిగ్రీల భయంకరమైన ఎండలో దేశం కోసం మ్యాచ్ ఆడుతున్నాం. ప్రాణాలను పణంగా పెడుతున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే దేశం కోసం సేవ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు, మా మతపరమైన చట్టాల్లో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ నిజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. తప్పిన ఉపవాసాన్ని తర్వాత పూర్తి చేయవచ్చు, నేను అదే చేశాను" అని షమీ వివరించాడు.

కొంతమంది కేవలం తాము పాప్యులర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇతరులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియాలో వచ్చే నెగటివిటీని తాను పట్టించుకోనని, అందుకే ఇప్పుడు కామెంట్లు చదవడం పూర్తిగా మానేశానని తెలిపాడు. "నేను సోషల్ మీడియాలో కామెంట్లు అస్సలు చదవను. నా సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ నా టీమ్ చూసుకుంటుంది. అందుకే నన్ను ఎవరు ఏమంటున్నారనేది నాకు తెలియదు, దాని గురించి బాధపడను" అని షమీ పేర్కొన్నాడు. 
Go Back to Shorts
Mohammed Shami
Shami
Indian Cricket
Ramadan Fasting
Cricket Controversy
Indian Pacer
Social Media Criticism
Religious Observance
Team India
Cricket News

More Telugu News