‘ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రుల తొలగింపు బిల్లు’ పై ప్రతిపక్షాల ఫైర్
- రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డ ప్రియాంకా గాంధీ
- నియంతృత్వ పోకడలకు దారితీసేలా ఉందని నేతల విమర్శ
- రాజకీయ ప్రత్యర్థుల నుంచి అధికారం లాక్కునే ఆయుధం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపు బిల్లు’పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల నుంచి అధికారాన్ని లాక్కునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చేస్తున్న కుట్ర అని ఆరోపించాయి. దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని, నియంతృత్వం వైపు నడిపిస్తోందంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రతిపక్షాలకు చెందిన సీఎంలను పదవి నుంచి దింపేయడం కేంద్రానికి సులభమవుతుందని పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆరోపించారు. రాజకీయ నేతల అవినీతిని అడ్డుకునేందుకే ఈ బిల్లు తెచ్చామంటూ బీజేపీ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు కేసుతో 30 రోజులకు పైగా జైలులో పెట్టి బీజేపీ అధికారాన్ని లాక్కుంటుందని ప్రియాంక ఆరోపించారు. బిల్లు అప్రజాస్వామికమని, దురదృష్టకరమని ఆమె అన్నారు.
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆరోపించారు. రాజకీయ నేతల అవినీతిని అడ్డుకునేందుకే ఈ బిల్లు తెచ్చామంటూ బీజేపీ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు కేసుతో 30 రోజులకు పైగా జైలులో పెట్టి బీజేపీ అధికారాన్ని లాక్కుంటుందని ప్రియాంక ఆరోపించారు. బిల్లు అప్రజాస్వామికమని, దురదృష్టకరమని ఆమె అన్నారు.