ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షమైన శశిథరూర్
- కొంత కాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉన్న శశిథరూర్
- నేడు ఎలెక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న ఇండియా కూటమి ఎంపీలు
మరోవైపు, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొంత కాలంగా శశిథరూర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.